News May 13, 2024
ఎన్డీఏకు 400 సీట్లు రానున్నాయి: మోదీ

ఇప్పటివరకు జరిగిన ఎన్నికలను చూస్తే ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. భారత సైన్యంపై కాంగ్రెస్ తన ద్వేషాన్ని ప్రతిసారి చూపిస్తోందన్నారు. రామమందిర నిర్మాణం తర్వాత కాంగ్రెస్ వైఖరి అర్థమైందని.. తిరిగి రాముడిని టెంట్లోకి పంపాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమేనని విమర్శించారు.
Similar News
News February 9, 2026
UK పీఎంగా తొలిసారి ముస్లిం వ్యక్తి?

తొలిసారి ముస్లిం వ్యక్తి UK PM పదవి చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత PM స్టార్మర్ సెక్స్ ట్రాఫికర్ ఎప్స్టీన్ ఫైల్స్ దుమారంలో చిక్కుకోవడంతో అధికార లేబర్ పార్టీలో ప్రకంపనలు రేగాయి. త్వరలో ఆయన పదవి కోల్పోతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు హోం సెక్రటరీగా ఉన్న షబానా మహమూద్(45) PM పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ఆమెకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. షబానా పేరెంట్స్కు పాక్ మూలాలున్నాయి.
News February 9, 2026
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశా వర్కర్ పోస్టులు

<
News February 9, 2026
అంధత్వాన్ని జయించి.. కేరళలో తొలి జడ్జిగా

‘సంకల్పం ముందు వైకల్యం ఎంత?’ అని నిరూపించారు కేరళకు చెందిన సి.తాన్యా నాథన్. అంధురాలైన తాన్యా కేరళలో తొలి అంధ మహిళా జడ్జిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఇటీవల జరిగిన జుడీషియల్ సర్వీస్ పరీక్షలో దివ్యాంగుల కేటగిరీలో ఆమె ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులూ న్యాయ వ్యవస్థలో విధుల నిర్వహణకు అర్హులని గతేడాది SC ఇచ్చిన తీర్పు ఆమె కలను నిజం చేసింది. బ్రెయిలీ లిపిలో ఆమె లా చదువుకున్నారు.


