News May 13, 2024
ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతం ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఏపీలో 23.10 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో 24.31 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. 2019లో ఇదే సమయానికి APలో 23.22 శాతం ఓటింగ్ నమోదవడం గమనార్హం.
Similar News
News February 21, 2026
పరీక్షల వేళ ఇలా ప్రిపేర్ అవ్వండి!

పరీక్షల సమయం వచ్చేసింది. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదవడం ముఖ్యం. కొత్త విషయాల కంటే చదివిన వాటిని పదేపదే రివిజన్ చేయడం వల్ల గుర్తుంచుకోవడం సులభమవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం గత ఏడాది ప్రశ్నపత్రాలను చెక్ చేసి ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా రిపీటయ్యే ప్రశ్నలపై దృష్టి సారించండి. ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధమై ఉత్తమ ఫలితాలను సాధించండి. ALL THE BEST
News February 21, 2026
ఇంట్లోనే సహజ రంగులు ఇలా చేద్దాం..

* పసుపు, శనగపిండి కలిపితే సులభంగా సహజ పసుపు రంగు సిద్ధమవుతుంది. * గోరింటాకు పొడితో గ్రీన్ కలర్ తయారు చేయవచ్చు. వెంటనే కడిగేసుకుంటే పెద్దగా మచ్చలు పడవు. * అపరాజిత/ శంఖు పుష్పాలతో బ్లూ కలర్ తయారు చేయవచ్చు. పూలను ఎండబెట్టి పొడిగా చేసి, అందులో కొద్దిగా బియ్యప్పిండి కలపాలి. అలాగే ఈ పూలను నీటిలో నానబెడితే వచ్చిన నీటినీ రంగుగా వాడుకోవచ్చు. * ఎండిన నారింజతొక్కలను ఉపయోగించి ఆరెంజ్ రంగు చేయవచ్చు.
News February 21, 2026
హోలీ కోసం ఇంట్లోనే సహజ రంగులు

* పింక్ కలర్ కోసం బీట్రూట్లను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి ద్రావణాన్ని వడకట్టి వాడొచ్చు. * ఎరుపు రంగు కోసం గులాబీ రేకులను మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి. తర్వాత ఎండలో పెట్టండి. ఎండబెట్టిన ఎరుపు మందార పువ్వులను పొడిగా చేసి, అందులో కొద్దిగా బియ్యప్పిండి కలిపితే ఎరుపు రంగు వస్తుంది. దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి వాటర్ కలర్గా వాడొచ్చు.


