News May 13, 2024

పారిస్ ఒలింపిక్స్: రెజ్లింగ్‌లో దేశం నుంచి ఒకే ఒక్కడు

image

పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ నుంచి పురుష రెజ్లర్లలో ఒక్కరు మాత్రమే అర్హత సాధించారు. 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అమన్ సెహ్రావత్ పోటీ పడనున్నారు. మిగతా వారు క్వాలిఫయర్స్‌లో ఓటమితో ఈ పోటీలకు దూరమయ్యారు. 2004లో ఆరుగురు, 2008లో ముగ్గురు, 2012, 2016, 2020లో నలుగురు చొప్పున రెజ్లర్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఈసారి ఒక్కరే వెళ్తుండడంతో దేశంలో రెజ్లింగ్ భవితవ్యంపై క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News February 17, 2026

జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు

image

AP: YS జగన్ అక్రమాస్తుల కేసులో IAS శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. కేసులో తన పేరును తొలగించాలన్న డిశ్ఛార్జ్ పిటిషన్‌ను SC తిరస్కరించింది. HC తీర్పును సమర్థించింది. నిబంధనలకు అనుగుణంగా తాను పనిచేశానని శ్రీలక్ష్మి విన్నవించగా రూల్స్‌ను పాటించలేదని CBI వాదించింది. శ్రీలక్ష్మి అండతో ఆమె మరిది భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపింది.

News February 17, 2026

AIIMS రిషికేశ్‌లో కాంట్రాక్ట్ పోస్టులు

image

AIIMS రిషికేశ్ 3 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BSc నర్సింగ్, బీఫార్మసీ, డీ ఫార్మసీ, BSc మెడికల్ టెక్నాలజీ, BSc (రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్), BSc(కంప్యూటర్ అప్లికేషన్స్) అర్హత గలవారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫార్మాసిస్ట్‌, టెక్నీషియన్‌కు రూ.40K, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.30K చెల్లిస్తారు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News February 17, 2026

ధూపం ఇలా పెడితే..

image

ధూపంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అందులో కర్పూరం, లవంగాలు కలిపి వేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. ‘గుగ్గులు ధూపం మనశ్శాంతిని, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆవు పిడకలపై పసుపు ఆవాల ధూపంతో ప్రతికూల శక్తి నశిస్తుంది. సంపాదన నిలకడగా ఉండాలంటే అగరుబత్తీల ధూపం, వాస్తు దోష నివారణకు వేపాకు ధూపం ఎంతో శ్రేష్ఠం. ఈ ఆచారాలు ఇల్లాంతటా ఆధ్యాత్మిక సుగంధాన్ని, ప్రశాంతతను నింపుతాయి’ అంటున్నారు పండితులు.