News May 13, 2024

HYD: మ.1 గంట వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మ.1 గంట వరకు HYDలో 19.37, మల్కాజిగిరిలో 27.69, సికింద్రాబాద్ 24.91, చేవెళ్ల 34.56 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 29.03 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News October 7, 2024

HYD: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీరే..!

image

HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్ PS పరిధిలో <<14294955>> రోడ్డు ప్రమాదంలో<<>> చనిపోయిన ఇద్దరి వివరాలు పోలీసులు తెలిపారు. షేక్ మదీనా బాషా (కుడి) TGRTCలో అసిస్టెంట్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అన్నోజు శ్రావణ కుమార చారి (ఎడమ) TKR కాలేజ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. మదీనా బాషా TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రావణ లిఫ్ట్ అడిగాడు. వీరి మరణవార్తతో కుటుంబపెద్దలను కోల్పోయామని వారు రోదిస్తున్నారు.

News October 7, 2024

HYD: కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం

image

భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ. 11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఆయనను ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రానికి ఐపీఎస్‌ల కేటాయింపు వంటి పలు అంశాలపై చర్చించి, సహకరించాలని కోరారు.

News October 7, 2024

HYD: నగరంలో ఇక కొత్త టెక్నాలజీతో సమస్యలకు చెక్

image

HYD అమీర్‌‌పేట్ ప్రధాన రహదారి శ్రీనగర్ కాలనీ ఆటో స్టాండ్ వద్ద సీవరేజి ఓవర్ ఫ్లో సమస్యను పరిష్కరించేందుకు జలమండలి ట్రెంచ్‌ లెస్ సాంకేతికతను అమలు చేయనుంది. మెట్రో పనుల సమయంలో సీవరేజి అలైన్‌మెంట్ దెబ్బతినడంతో మురుగు సెల్లార్లలోకి చేరుతోంది. ప్రధాన రహదారిపై తవ్వకాలు చేయడానికి అనుమతి లేని కారణంగా, ఈ సాంకేతికతతో సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. త్వరలో మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నారు.