News May 13, 2024

విజయవాడ: ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు

image

సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు, ప్రశాంతి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో పౌరులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News March 12, 2026

కృష్ణమ్మ చెంత.. ఇసుకాసురుల పంజా!

image

విజయవాడ-అవనిగడ్డ కరకట్ట వెంబడి <<19359993>>ఇసుక దోపిడీ<<>> జోరుగా సాగుతోంది. ఒక మీటరు తవ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కి లోతుగా తవ్వేస్తుండగా, 20 టన్నుల సామర్థ్యం గల లారీల్లో 35 టన్నుల లోడుతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. మైనింగ్ మంత్రి నియోజకవర్గంలోనే అక్రమాలు జరుగుతున్నా విజిలెన్స్ తనిఖీలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారుల అండదండలతోనే ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

News March 12, 2026

కృష్ణా: ఎంత తవ్వినా చుక్క రావట్లేదు..!

image

దివిసీమలో <<19359974>>అక్రమ ఇసుక తవ్వకాలు<<>> భూగర్భ జలాలను కబళిస్తున్నాయి. పులిగడ్డ నుంచి VJA వరకు నిబంధనలకు విరుద్ధంగా లోతుగా తవ్వేయడంతో, గతంలో 10 అడుగులకే దొరికే నీరు ఇప్పుడు 100 అడుగుల లోతులోనూ లభించడం లేదు. ఫలితంగా సాగు, తాగునీటి కోసం రైతులు, ప్రజలు అల్లాడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టాలని బాధితులుడిమాండ్ చేస్తున్నారు.

News March 12, 2026

కృష్ణా: ఒకటే బిల్లు.. ట్రిప్పులు వాళ్లిష్టం!

image

కృష్ణాలో<<19360004>> ఇసుక మాఫియా<<>> అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. ఒకే బిల్లుతో రోజంతా ఇష్టం వచ్చినట్లు ట్రిప్పులు వేస్తూ రూ. కోట్ల సంపదను కొల్లగొడుతున్నారు. నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఉన్నా, వాటిని ఉద్దేశపూర్వకంగా ఆపేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ లారీల రాకపోకలతో VJA-అవనిగడ్డ కరకట్ట రోడ్డు పూర్తిగా ధ్వంసమై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోటం లేదన్న విమర్శలొస్తున్నాయి.