News May 13, 2024

రికార్డు స్థాయి పోలింగ్ దిశగా..

image

AP: రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదవుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత పోలింగ్ ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈసారి 80% దాటేలా కనిపిస్తోంది. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో 2009: 75.9%, 2014: 78.4%, 2019లో 79.6% మేర పోలింగ్ నమోదైంది. 2024లో సా.5 గంటలకే 67.99% నమోదవడంతో క్యూలైన్లో ఉన్న వారి ఓటింగ్ పూర్తయ్యేసరికి 80% దాటొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News March 3, 2026

మత్తు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడి

image

TG: ఓ యువతికి యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన బాచుపల్లి(Hyd)లోని బీటెక్ కాలేజీలో జరిగింది. పోలీసుల ప్రకారం.. తనయ్ అనే స్టూడెంట్ అదే కాలేజీలో చదివే యువతికి మాయమాటలు చెప్పి మత్తు చాక్లెట్లు ఇచ్చి క్లాసులోనే పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆ ఫొటోలు నెట్‌లో పెడతానని బెదిరించాడు. అతని స్నేహితుడూ వేధించాడు. దీంతో ఆత్మహత్యాయత్నం చేయగా ఇంట్లోవాళ్లకు తెలిసి పోలీసులను ఆశ్రయించారు.

News March 3, 2026

హార్ముజ్‌లో నిలిచిపోయిన 700+ నౌకలు

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ఆ మార్గంలో ఇరువైపులా 700+ నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లో 334 క్రూడ్ ఆయిల్, 263 శుద్ధి చేసిన, 109 శుద్ధి చేయని చమురు తదితర ట్యాంకులున్నాయి. మార్చి 1వ తేదీనే ఈ మార్గంలో రాకపోకలకు భయపడి కేవలం 3 ట్యాంకర్లతో 2.8M బ్యారెల్స్ చమురునే నౌకలు తరలించాయి. సాధారణ రాకపోకలకు పోలిస్తే ఇది 86% తగ్గినట్లే. నిన్న ఓ చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాయి.

News March 3, 2026

ఇరాన్ ప్లాస్టిక్ డ్రోన్ల సంచలనం!

image

సౌదీలోని ‘అరామ్‌కో’ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ షాహెద్-136 <<19277309>>డ్రోన్లతో<<>> దాడి చేసింది. అమెరికా టెక్నాలజీతో డెవలప్ చేసిన ఈ డ్రోన్లు ప్లాస్టిక్, కార్బన్ ఫైబర్‌తో రూపొందాయి. ఇవి భూమికి 50 అడుగుల ఎత్తులోనే ప్రయాణిస్తాయి. లోహాన్ని మాత్రమే గుర్తించే US రాడార్లకు ఇవి చిక్కకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ ఆయుధం జియోపాలిటిక్స్‌లో అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతోంది.