News May 13, 2024
టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారు: సజ్జల

AP: పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘పల్నాడు జిల్లాలో ఏకపక్షంగా దాడులు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే మాకు కావాలి. అందుకే మేం ఎంతో సంయమనంతో ఉన్నాం. ప్రభుత్వం సానుకూలత ఉప్పెనలా కనిపిస్తోంది. పేదల కోసం జగన్ ఎంతో చేశారు. మహిళల ఆశీర్వాదం వైసీపీకే ఉంది’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News March 6, 2026
దూసుకెళ్తున్న బాలెన్ షా పార్టీ

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల <<19309327>>ఫలితాల్లో<<>> రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) దూసుకెళ్తోంది. 68 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ప్రత్యర్థులు దీనికి దరిదాపుల్లో కూడా లేరు. మాజీ PM కేపీ ఓలీ పార్టీ 5 సీట్లతో మూడో స్థానానికి పడిపోయింది. గగన్ కుమార్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ 9 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. దీన్ని బట్టి బాలెన్ షాకు చెందిన RSP ఫుల్ మెజార్టీతో అధికారం చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది.
News March 6, 2026
10 రోజులు కరెంట్ కోతలు.. ఎందుకంటే?

TG: రాష్ట్రంలో రాబోయే 10 రోజులు గృహ అవసరాలకు షెడ్యూల్ చేయని కరెంట్ కోతలు ఉంటాయని తెలుస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరగడంతో హైదరాబాద్తో సహా అనేక చోట్ల పవర్ సప్లై పరికరాలు ఓవర్లోడ్ను ఎదుర్కొంటున్నాయి. దీంతో అధికారులు నిర్వహణ పనులు చేపట్టారు. ఈ పనుల పూర్తికి కనీసం వారం పట్టనుంది. గ్రామాల్లోనూ పాత ట్రాన్స్ఫార్మర్లను మారుస్తున్నారు. డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు తెలిపారు.
News March 6, 2026
రేపు 11:01AMకి ‘ధురంధర్-2’ ట్రైలర్

ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ధురంధర్-2’ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 11.01 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈసారి హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. కాగా ‘ధురంధర్’ తొలి పార్ట్ ఏకంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.


