News May 13, 2024

GREAT: ఒకే ఇంట్లో 30 మంది ఓటింగ్

image

ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగిమాను పెంటకు చెందిన వైస్ ఎంపీపీ-2 తోట జయకుమార్ కుటుంబం చాలా పెద్దది. వారింట్లోనే 30 మంది ఓటు వేయడం విశేషం. మండలంలోని తమ కుటుంబానికి చెందిన 30 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News April 3, 2026

చిత్తూరు: గ్యాస్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

గ్యాస్ సిలిండర్ల సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్టు చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. ఇప్పటివరకు 50 సమస్యలపై ఫిర్యాదులు రాగా.. ఏజెన్సీలతో చర్చించి 46 సమస్యలు పరిష్కరించామని చెప్పారు. గ్యాస్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ 08572-242734కు కాల్ చేయాలని సూచించారు. గుడిపాలలో గ్యాస్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు.

News April 3, 2026

చిత్తూరు జిల్లాలో స్పెషల్ ఆఫీసర్ల నియామకం

image

సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 27 మండలాల్లో 621 పంచాయతీలు ఉన్నాయి. వీటికి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, జలవనరులు శాఖ ఏఈలు, డిప్యూటీ డీఈఈలు, ఎఫ్ఎవోలు, పశు, ఉద్యానశాఖ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు.

News April 2, 2026

చిత్తూరు: హెల్మెట్ పెట్టుకుంటే బహుమతులు

image

చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు హెల్మెట్ పెట్టు- బహుమతి పట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలని నిర్ణయించారు. ముఖ్య ట్రాఫిక్ కూడళ్లలో పోలీసులు అందజేసే స్లిప్పులను పూర్తి చేసి వివరాలు నమోదు చేయాలి. వారాంత, నెలసరి బహుమతులు అందిస్తామని పేర్కొంటున్నారు. వాటితో పాట సర్టిఫికెట్లు, మెమెంటోలు అందిస్తామన్నారు.