News May 13, 2024

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్: కలెక్టర్

image

జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని కలెక్టర్/ఎన్నికల అధికారి జీ.సృజన తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. పోలింగ్ ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 7, 2026

కర్నూలు: కాలేజీకి రాకుండానే పరీక్షలు.. బీఈడీ కాలేజీల దందా!

image

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, హోళగుందలోని పలు బీఈడీ కాలేజీలు బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీకి రాకుండానే పరీక్షలు రాసేలా యాజమాన్యాలు విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. RJD స్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల అనుమతులు రద్దు చేయాలని DSF విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.

News March 7, 2026

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకా డ్రైవ్

image

జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే బాలికలకు ‘గార్డాసిల్-4’ టీకా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. జిల్లాలో 19,704 మంది బాలికలను లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమం మూడు నెలలు కొనసాగుతుందని వెల్లడించారు.

News March 6, 2026

అక్రమ మైనింగ్‌ను కట్టడి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడంతో పాటు మైనింగ్‌కు సంబంధించిన అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖకు సంబంధించిన అంశాలపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. సహజ వనరులను సంరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు.