News May 13, 2024
ఈవీఎంలలో డేటా ఎన్నేళ్లు ఉంటుందంటే?

ఈవీఎం వ్యవస్థను అత్యంత సురక్షితమైన, కచ్చితమైన ఓటింగ్ ప్రక్రియగా ఈసీ పేర్కొంటుంది. ప్రస్తుతం 2006 తర్వాత వచ్చిన EVM మోడల్స్ను వినియోగిస్తున్నారు. ఒక్క ఈవీఎంలో 2వేల ఓట్ల వరకు నమోదు చేయొచ్చు. ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ మెషీన్లు 15 ఏళ్ల వరకు పనిచేయగలవు. ఇందులోని కంట్రోల్ యూనిట్ మనం వేసిన ఓట్లకు సంబంధించిన డేటాను 10ఏళ్ల వరకు స్టోర్ చేయగలదు.
Similar News
News February 18, 2026
పూజ పూర్తయ్యాక ఈ తప్పులు చేస్తున్నారా?

దైవానుగ్రహం కలగాలంటే పూజ సమయంలోనే కాదు, పూజ తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి. పూజ ముగిసిన వెంటనే కాళ్లు కడగకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. పూజ చేసిన రోజున మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. నైవేద్యాన్ని సమర్పించిన వెంటనే తీయకూడదు. కాసేపు అక్కడే ఉంచాలి. పూజలో, పూజానంతరం కోపతాపాలు మానాలి. ప్రశాంతంగా ఉంటే దైవశక్తి పెరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు మీ ఇంట్లో సానుకూలతను నింపుతాయి.
News February 18, 2026
BECILలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)లో 6 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech,డిప్లొమా, ITI, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జూనియర్ ఇంజినీర్కు గరిష్ఠ వయసు 40 ఏళ్లు కాగా, సూపర్వైజర్, MTSపోస్టుకు 45ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.becil.com
News February 18, 2026
వరిలో కంకి నల్లిని ఎలా నివారించాలి?

వరి పైరులో గింజ పాలుపోసుకునే దశలో కంకి నల్లి ఆశిస్తుంది. వీటి వల్ల ఆకులపై పసుపు రంగు చారలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి నల్లగా మారతాయి. గింజలపై కూడా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల గింజలు పాలు పోసుకోకుండా తాలుగా మారి పంట దిగుబడి 20-30% తగ్గే అవకాశం ఉంది. కంకినల్లి నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా స్పెరోమెసిఫిన్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో మందుమార్చి 2 సార్లు పిచికారీ చేయాలి.


