News May 14, 2024

ఏపీలో పోలింగ్ ఇలా..

image

ఏపీలో నిన్న అర్ధరాత్రి వరకు 78.25శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. అత్యధికంగా అమలాపురం(SC) లోక్‌సభ స్థానానికి 83.19శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా విశాఖపట్నంలో 68% శాతం ఓటింగ్ జరిగింది. మరోవైపు అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా ధర్మవరంలో 88.61%, అత్యల్పంగా పాడేరులో 55.45% పోలింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం కల్లా ఈసీ పూర్తి వివరాలు వెల్లడించనుంది.

Similar News

News March 5, 2026

భర్త జీతం నుంచి నేరుగా భార్య ఖాతాకు భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

కూతురితో జీవిస్తున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలు పాటించని భర్తకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా అతని జీతం నుంచి ₹25Kను నేరుగా భార్య ఖాతాలో జమ చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అతను 2022 నుంచి భార్య నుంచి విడిగా ఉంటూ భరణం ఇవ్వట్లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ‘భరణం దాతృత్వం కాదని, భార్య, పిల్లలు గౌరవంగా జీవించడానికి ఉద్దేశించిన చట్టపరమైన హక్కు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

News March 5, 2026

సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

image

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.

News March 5, 2026

3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

image

T20WC: 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతోంది. 6 ఓవర్లలో 68 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 5, బట్లర్ 25, బ్రూక్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. బెథెల్ (26*), బాంటన్ (4*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 84 బంతుల్లో 186 రన్స్ కావాలి. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.