News May 14, 2024

సదాశివనగర్: ఓటేసి వచ్చి.. మృతిచెందాడు!

image

ఓటేసి వచ్చి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం రామారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన మొల్ల షఫీ (48) లైన్లో 30 నిమిషాలు నిలబడి ఓటు వేశారు. ఇంటికెళ్లిన తర్వాత గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News March 11, 2026

ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి: సీపీ సాయి చైతన్య

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పోలీస్ శాఖ అమలు చేయాల్సిన 99 రోజుల కార్యక్రమాలపై సీపీ సాయి చైతన్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బంది కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా గ్రామాలను సందర్శించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు చేరువగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 10, 2026

NZB: ఇంటర్ పరీక్షలు.. 377 మంది గైర్హాజరు

image

NZB జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం భౌతికశాస్త్రం, అర్ధ శాస్త్రం, ఒకేషనల్ పరీక్షలకు 377 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DIEO రవికుమార్ తెలిపారు. మొత్తం 16,678 మంది విద్యార్థులకు గాను 16,301 మంది హాజరయ్యారన్నారు. జనరల్‌లో 14,305మంది విద్యార్థులకు గాను 13,997 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 2,373 మంది విద్యార్థులకు గాను 2,304 మంది పరీక్షలు రాశారు.

News March 10, 2026

NZB: తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యం

image

కోటగిరి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(27) తన ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. స్థానికంగా, బంధువుల వద్ద వెతికినా వారి ఆచూకీ లభించలేదని భర్త గంగాధర్ పేర్కొన్నారు. అలాగే కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సాయిలు(27) హోటల్‌కు వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై సునీల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.