News May 14, 2024
తాజా అప్డేట్: ఉమ్మడి ప.గో.లో అత్యధిక పోలింగ్ ఇక్కడే

ఉమ్మడి ప.గో జిల్లాలో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఏలూరు జిల్లాలో అత్యధికంగా 83.04%.. పశ్చిమ గోదావరి జిల్లాలో 81.12% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఉంగుటూరులో అత్యధికంగా 87.75%, అత్యల్పంగా ఏలూరులో 71.02% పోలింగ్ నమోదైంది.
NOTE: పూర్తి గణాంకాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పోలింగ్ శాతం మరింత పెరగొచ్చు.
Similar News
News March 4, 2026
రెవెన్యూ క్లినిక్లతో భూ సమస్యలకు చెక్: ప.గో కలెక్టర్

పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ క్లినిక్ల ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతోందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి కోరారు. కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అందిన 420 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 97 పరిష్కరించామని, 29 తిరస్కరించామని తెలిపారు. మిగిలిన 294 దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News March 3, 2026
ఆకివీడు సీఐ జగదీశ్వరరావు సస్పెండ్

ఆకివీడు సీఐ జగదీశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. డెడ్ బాడీ పార్సెల్ నిందితుడు సుధీర్ వర్మపై వచ్చిన ఫిర్యాదులో పోక్సో (POCSO) కేసు నమోదు చేయలేదనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కాకా 2024 ఆగస్టులో ఆకివీడు సీఐగా నియమితులయ్యారు.
News March 3, 2026
ప.గో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో శబ్ద, వాయు కాలుష్య నియంత్రణపై కలెక్టర్ నాగరాణి భీమవరంలో అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు, ఆలయాలు, ఆసుపత్రుల వద్ద బాణాసంచా కాల్చకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కుటుంబ సర్వే, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


