News May 14, 2024
శ్రీ సత్యసాయి: చెరువులో గుర్తుతెలియని మృతదేహం

లేపాక్షి మండలం మానేపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ గోపీ తెలిపారు. దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి పడేశారని పేర్కొన్నారు. ఎక్కడో హత్యచేసి ఇక్కడ పడేశారా? లేక ఇక్కడే హత్య చేశారా? అనే కోణంలో విచారిస్తున్నామని చెప్పారు. హత్యచేసి దాదాపు పది రోజులై ఉంటుందని, మృతదేహం బాగా కుళ్లిపోయిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News March 16, 2026
అందరికీ ధన్యవాదాల: అనంత కలెక్టర్

గుత్తి పట్టణంలో తొలిసారిగా రెండు రోజులపాటు నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో కార్యక్రమాలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
News March 16, 2026
114 అర్జీలను స్వీకరించాం: అనంత ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 114 పిటీషన్లు స్వీకరించినట్లు ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. పిటీషనర్లతో ముఖాముఖి మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పిటీషనర్లు, వీరి వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఇస్కాన్ సహకారంతో ఉచిత భోజన సదుపాయం కల్పించామన్నారు.
News March 16, 2026
అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి: అనంత కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ ఆనంద్ అధికారులు అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన 405 అర్జీలను సంబంధిత శాఖలు నిర్ణీత గడువులో పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


