News May 14, 2024

కోనసీమ: ఓటు వేశాక ఫిట్స్.. చికిత్స పొందుతూ మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠానికి చెందిన కర్రి సత్యనారాయణ(52) ఫిట్స్‌తో మృతి చెందాడు. గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం ఓటు వేసిన అనంతరం ఫిట్స్‌తో స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే సత్యనారాయణ మృతితో కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది.

Similar News

News April 2, 2026

హాస్టల్‌కు వెళ్లిన కలెక్టర్ కీర్తి చేకూరి.. కారణం ఇదే!

image

అమరావతిని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో గురువారం రాత్రి కలెక్టర్ కీర్తి చేకూరి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఆమె స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని ఆమె సూచించారు. కలెక్టర్ రాకతో వసతి గృహంలో సందడి నెలకొంది.

News April 2, 2026

వరి నుంచి ఆయిల్ పామ్‌కు మారండి: DAO రాబర్ట్ పాల్

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో APCNF, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ సూచించారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా వరి నుంచి ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News April 2, 2026

అమరావతికి చట్టబద్ధత.. పురందీశ్వరి హర్షం

image

అమరావతి ఏపీ ఏకైక రాజధానిగా పార్లమెంట్‌లో చట్టబద్ధత లభించడంపై ఎంపీ పురందీశ్వరి హర్షం వ్యక్తం చేశారు. లోక్‌సభ, రాజ్యసభలలో బిల్లుకు ఆమోదం లభించడం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దక్కిన విజయమని గురువారం పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.