News May 14, 2024

కృష్ణా : ఓటు వేసేందుకు వచ్చి.. వివిధ కారణాలతో నలుగురి మృతి

image

కృష్ణా జిల్లాలో సోమవారం విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓటేయడానికి వచ్చిన పలువురు వివిధ కారణాలతో మృతి చెందారు. పెనమలూరుకు చెందిన ఈశ్వరరావు(72) ఓటేసిన తర్వాత అస్వస్థతకు గురై మరణించగా.. పెనమలూరు మం. పెదపులిపాకకు చెందిన వెంకటేశ్వరరావు(75), కైకలూరు వాసి ప్రభాకరరావు(65) ఓటేసేందుకు వరుసలో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు. వీరితో పాటు మేడూరుకు చెందిన నాగభూషణం(54) ఓటుకు వెళ్తూ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

Similar News

News October 29, 2025

సీఎం షెడ్యూల్ మార్పు.. అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ పర్యటన.?

image

సీఎం చంద్రబాబు షెడ్యూల్‌లో మార్పు జరిగింది. ఆయన నేడు కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించనున్నారు. కాగా, అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రోడ్డు మార్గంలో కోడూరు, నాగాయలంక మండలాలను సందర్శించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధితులను పరామర్శిస్తారని సమాచారం.

News October 29, 2025

సీఎం షెడ్యూల్ మార్పు.. అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ పర్యటన.?

image

సీఎం చంద్రబాబు షెడ్యూల్‌లో మార్పు జరిగింది. ఆయన నేడు కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించనున్నారు. కాగా, అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రోడ్డు మార్గంలో కోడూరు, నాగాయలంక మండలాలను సందర్శించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధితులను పరామర్శిస్తారని సమాచారం.

News October 29, 2025

కృష్ణా: అక్టోబర్, నవంబర్ నెలల్లో జిల్లాను వణికించిన తుపాన్‌లివే.!

image

1968 నవంబర్‌లో వచ్చిన భారీ తుఫాన్ కృష్ణా జిల్లాపై ప్రభావం చూపింది. 1995 నవంబర్‌లో 180 కి.మీ వేగంతో వీచిన గాలుల తుఫాన్‌తో పంటలు, చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1999 సూపర్ సైక్లోన్ జిల్లాను కుదిపేసింది. 2010 జలసైక్ల్‌న్‌లో లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. 2012, 2013 నీలం, పైలాన్ తుపాన్‌లు తీరప్రాంతాల్లో కల్లోలం సృష్టించాయి. 2014, 2018 హుద్‌హుద్, తిత్లీ విధ్వంసం నేటికీ జిల్లా ప్రజలు మర్చిపోలేదు.