News May 14, 2024

35 ఏళ్ల తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్న మాదన్న

image

న్యూడెమోక్రసీ దళ సభ్యుడిగా పనిచేసి 35 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు 50 ఏళ్ల వయస్సులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లెందు మండలం కొమరారంలో సోమవారం ఆయన ఓటు వేశారు. చిన్నతనంలోనే అజ్ఞాత దళ సభ్యుడిగా చేరిన మధు కమాండర్ స్థాయికి ఎదిగారు. 2000 సంవత్సరంలో మొదటిసారిగా అరెస్ట్ అయిన ఆయన బెయిల్ పై బయటకు వచ్చినా మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు.

Similar News

News November 10, 2025

ఖమ్మం రోడ్లపై ధాన్యం రాశులు.. ప్రమాద భయం

image

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ ధాన్యాన్ని ఆరబోయడానికి మార్కెట్‌ యార్డుల కొరత ఉండటంతో రైతులు పంటను ప్రధాన రహదారులపైనే పోస్తున్నారు. దీంతో వడ్ల రాశులు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయి వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు మార్కెట్‌ యార్డులను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News November 10, 2025

ఖమ్మం: ఉపాధ్యాయుల హాజరుపై ‘యాప్’ కొరడా!

image

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు కోసం ప్రవేశపెట్టిన FARS యాప్ ఇప్పుడు ఉపాధ్యాయులపై నిఘా పెట్టింది. హాజరు తక్కువ ఉన్న హెచ్‌ఎంలను కలెక్టర్ మందలించారు. సక్రమంగా హాజరుకాని టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సమయపాలన, సెలవు/ఓడీ అప్‌డేట్‌ యాప్‌లో తప్పనిసరి. ఈ కఠిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.

News November 10, 2025

‘వనజీవి రామయ్య’ బయోపిక్‌కు భట్టికి ఆహ్వానం

image

పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవానికి రావాలని చిత్ర దర్శకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మొక్కల కోసం జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చరిత్రను సినిమాగా తీయడం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.