News May 14, 2024

కర్నూలు: పోలింగ్ కేంద్రంలో వ్యక్తి మృతి

image

మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఈరన్న సోమవారం ఓటేసేందుకు వెళ్లి పోలింగ్ బూత్‌లోనే మృతిచెందారు. మాధవరంలో ప్రాథమిక పాఠశాలలో ఓటేసేందుకు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. అప్పటికే కళ్లు తిరుగుతున్నాయని తోటి ఓటర్లతో చెప్పారు. చివరికి ఓటు వేసి బయటకు వస్తుండగా స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్న ఎన్నికల సిబ్బంది, తోటి ఓటర్లు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందారు.

Similar News

News March 28, 2026

కర్నూలు జిల్లాలో 52 వాహనాలు స్వాధీనం

image

మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ కింద జిల్లావ్యాప్తంగా శనివారం మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో 196 మంది పోలీసులతో చేపట్టిన తనిఖీల్లో 350 మందిని, 50 ఇళ్లను పరిశీలించారన్నారు. 77 వాహనాలు తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మంత్రాలయం పరిధిలో 41 లిక్కర్ బాటిళ్లు సీజ్ చేశారన్నారు.

News March 28, 2026

సెయింట్ జోసెఫ్‌లో ‘జీరో వేస్ట్’ అవగాహన సదస్సు

image

కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో శనివారం ‘జీరో వేస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పొడి, తడి, పారిశుధ్య వ్యర్థాల విభజన విధానంపై వారు విద్యార్థులకు వివరించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా పారిశుధ్యంపై అవగాహన కల్పించారు.

News March 27, 2026

కందుకూరు ఘటనపై కర్నూలు ఎంపీ దిగ్భ్రాంతి

image

కోసిగి మండలం కందుకూరు సమీపంలో తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లిన కర్ణాటక వాసుల నలుగురు మృతి చెందిన ఘటనపై ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారాన్ని అధికారుల నుంచి తెలుసుకున్న ఎంపీ.. మృతదేహాలను త్వరగా వారి స్వస్థలాలకు తరలించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.