News May 14, 2024
81శాతం పోలింగ్ నమోదు కావొచ్చు: ముకేశ్ కుమార్

AP: రాష్ట్రంలో మొత్తం 81శాతం పోలింగ్ నమోదు కావొచ్చని సీఈవో ముకేశ్ కుమార్ మీనా అభిప్రాయపడ్డారు. 1.2శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని ఇప్పటివరకు 79.40శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారని మీనా వివరించారు.
Similar News
News March 17, 2026
డీఎంకే బెదిరించిందని ఆరోపణలు.. స్పందించిన రజినీకాంత్

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో డీఎంకే ఆయన్ను బెదిరించిందని టీవీకే నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రజినీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆధవ్ అర్జున వ్యాఖ్యల్లో నిజం లేదు. ఆయన వ్యాఖ్యలను ఖండించి నాకు మద్దతుగా నిలిచిన నేతలకు, అభిమానులకు ధన్యవాదాలు. కాలం మాట్లాడకపోవచ్చు. కానీ వేచి ఉండి సమాధానం ఇస్తుంది’ అని పేర్కొన్నారు.
News March 17, 2026
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన!

LPG వినియోగదారుల్లో eKYCపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇప్పటివరకు eKYC పూర్తి చేయనివారు మాత్రమే చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసుంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ‘ఉజ్వల లబ్ధిదారులు మాత్రం ఏడాదికి ఒకసారి చేయాలి. అది కూడా 8, 9వ రీఫిల్స్పై సబ్సిడీ పొందడానికి ఇది అవసరం. దీనివల్ల గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు’ అని పేర్కొంది.
News March 17, 2026
కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 41-61కి.మీ మధ్య గాలులు వీయడంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది.


