News May 14, 2024
2-3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నా: డీకే అరుణ

TG: యువత, SC, ST, BCలు తమకు అండగా నిలిచారని మహబూబ్నగర్ BJP MP అభ్యర్థి DK అరుణ చెప్పారు. CM రేవంత్ 8సార్లు జిల్లాలో ప్రచారం చేసినా, కాంగ్రెస్ నేతలు భయపెట్టినా ప్రజలు తమవైపే నిలిచారని తెలిపారు. తాను 2-3 లక్షల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించబోతోందన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించామని పేర్కొన్నారు.
Similar News
News February 11, 2026
మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) భేటీలో నిర్ణయించారు. 17 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 15న శివరాత్రి, తర్వాతి రోజు 16న, మార్చి 1, 2, 3 తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. 17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చిస్తారు. అవసరమైతే సమావేశాలను పొడిగించాలని నిర్ణయించారు.
News February 11, 2026
నో ఎగ్జామ్.. టెన్త్ ఉత్తీర్ణతతో 28,740 ఉద్యోగాలు

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం ఉద్యోగాలకు దరఖాస్తు గడువు feb 14తో ముగియనుంది. 16 వరకు ఫీజు చెల్లించాలి. ఏపీలో 1,060, తెలంగాణలో 608 పోస్టులు ఖాళీ ఉన్నాయి. టెన్త్ ఉత్తీర్ణత కలిగి ఉండి 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. టెన్త్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. శాలరీ పోస్టును బట్టి రూ.10వేల నుంచి రూ.29,380గా ఉంది.
అప్లికేషన్ కోసం ఇక్కడ <
News February 11, 2026
దళిత యువతి వంట చేస్తోందని..

తరాలు మారుతున్నా కుల వివక్ష ఆగడం లేదు. ఒడిశాలోని కేంద్రపడాలో దళిత యువతి వంట చేస్తోందని అంగన్వాడీకి పిల్లలను పంపడం లేదు. శర్మిష్ఠ సేథి(23) ఇటీవల ఘడియామల్లోని అంగన్వాడీలో హెల్పర్-కుక్గా నియమితులయ్యారు. ఆమె వంట చేస్తోందని అంగన్వాడీకి ఎవరి పిల్లల్నీ పంపొద్దని విలేజ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో 3 నెలలుగా ఈ సెంటర్ మూతబడింది. విషయం బయటికి రావడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు.


