News May 14, 2024
PROUD MOMENT

భారత వారసత్వ సంపద అయిన రామచరిత్ మానస్, పంచతంత్ర, సహృదయాలోక-లోచనా వంటి ఇతిహాసాలు UNESCOకి చెందిన ఆసియా-పసిఫిక్ రిజిస్టర్ మెమరీలో చోటు దక్కించుకున్నాయి. ఈ ఘనత సాధించడం భారతదేశానికే గర్వకారణమని సాంస్కృతిక శాఖ పేర్కొంది. ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణలో ఇది ఒక ముందడుగని తెలిపింది. ఈ సాహిత్య కళాఖండాలను గుర్తించడం వల్ల వీటి రచయితలకు గొప్ప నివాళులు అర్పించడమేనని వెల్లడించింది.
Similar News
News March 20, 2026
లక్ష్యాలను అధిగమించండి: అన్నమయ్య కలెక్టర్

రెవెన్యూ శాఖ తమ ఆదాయ లక్ష్యాలను అధిగమించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లెలోని కలెక్టరేట్ ఆయన సమీక్షించారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణ, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వాణిజ్య కార్యకలాపాలు, వస్తువుల సేవల వినియోగంపై జీఎస్టీ వసూళ్లు పక్కాగా జరగాలని ఆదేశించారు.
News March 20, 2026
టెన్త్ పరీక్షల రద్దుపై క్లారిటీ

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దవుతాయనే ప్రచారంపై విద్యా కమిషన్ OSD డా.జీనత్ క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేయమని ఎక్కడా సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. కేవలం 11వ తరగతి (ఇంటర్ ఫస్టియర్) పబ్లిక్ పరీక్షల రద్దుకే ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. SSC బోర్డు, ఇంటర్ బోర్డు (BIE) విలీనానికి కమిషన్ సిఫార్సు చేసిందని తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు.
News March 20, 2026
బీసీసీఐ నాపై వివక్ష చూపింది: శివరామకృష్ణన్

మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీసీసీఐ కామెంట్రీ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బోర్డుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘23 ఏళ్లుగా పెద్ద మ్యాచ్లకు టాస్ వేయడం, అవార్డు ప్రజెంటేషన్లకు నన్ను వాడుకోకుండా BCCI వివక్ష చూపింది. నా పాత్రను పరిమితం చేసింది. నా తర్వాత వచ్చిన వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. ఆత్మ గౌరవాన్ని కోల్పోయి పనిచేయలేను’ అని SMలో పోస్టులు చేశారు.


