News May 14, 2024

ఏలూరు: ACCIDENT.. మామాఅల్లుడు మృతి

image

ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికుల వివరాలు.. ఏలూరులోని సత్యనారాయణపేటకు చెందిన గొర్రెల ప్రకాష్(30) వృత్తిరీత్యా పాలిష్ వర్క్ చేస్తుంటాడు. మంగళవారం మేనమామ రంగారావు(50)తో కలిసి బైక్‌పై పెదవేగి మండలం వేగివాడకు బయలుదేరాడు. దెందులూరు మండలం నాగులదేవునిపాడు వద్ద టిప్పర్ లారీ ఢీ కొంది. ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందగా, రంగారావు ఏలూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు.

Similar News

News March 18, 2026

నరసాపురంలో వ్యక్తి మృతి.. ఇతనెవరో తెలుసా!

image

నరసాపురం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై బుధవారం గుర్తు తెలియని ఓ వ్యక్తి (45) మృతి చెందారు. రైలు ఎక్కేందుకు వచ్చిన ఆయన అస్వస్థతతో అక్కడికక్కడే కన్నుమూశారు. మృతుని వివరాలు తెలియరాలేదు. ఆచూకీ తెలిసిన వారు భీమవరం జీఆర్‌పీ ఎస్సై సుబ్రహ్మణ్యంను 9908448729 నంబరులో సంప్రదించాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

News March 18, 2026

ప.గో: కుమారుడితో కలిసి టెన్త్ పరీక్షలు రాస్తున్న తల్లి

image

పాలకొల్లుకు చెందిన ముత్యాల అశ్విని (33) తన కుమారుడు విజయ్‌తో కలిసి పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. 2001లో ఆరో తరగతితోనే చదువు ఆపేసి చిన్న వయసులో వివాహం చేసుకున్న ఆమె.. ఇన్నాళ్లకు కుమారుల చొరవతో మళ్లీ పుస్తకం పట్టారు. చదువు విలువ తెలుసుకొని ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్న ఈ తల్లి పట్టుదలను స్థానికులు అభినందిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనే వారి ఆశయం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

News March 18, 2026

నరసాపురం వాసికి రాష్ట్ర స్థాయి అవార్డు

image

నరసాపురం రుస్తుంబాదకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు కొప్పినీడి విజయ మోహన్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. మంగళవారం ఈ ప్రకటన వెలువడగా, ఆయన ప్రస్తుతం పాలకొల్లు మండలం గవరపేట సచివాలయంలో విలేజ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా సేవలు అందిస్తూనే, చిత్రకళలో విజయాలు సాధిస్తున్న ఆయనను తోటి ఉద్యోగులు, స్థానికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.