News May 14, 2024
ఏపీలో 81.3% శాతం పోలింగ్?

AP: రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తంగా 81.3% శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. దీనిపై కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. 2019 ఎన్నికల్లో 79.6% కంటే ఈసారి 1.7 శాతం ఎక్కువ పోలింగ్ నమోదవడం గమనార్హం.
Similar News
News March 18, 2026
సాంగ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన మంగ్లీ

పాన్ ఇండియా మూవీ ‘KD: ది డెవిల్’లో తాను పాడిన <<19406830>>పాటపై<<>> తలెత్తిన వివాదంపై సింగర్ మంగ్లీ SM వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆ పాటను అన్ని ప్లాట్ఫామ్ల నుంచి తొలగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఎవరినీ నొప్పించడం తమ ఉద్దేశం కాదన్నారు. సవరించిన లిరిక్స్తో కొత్త వెర్షన్ను ఇవాళ విడుదల చేస్తామని తెలిపారు. అలాగే ఈ పాటలో నటించిన నోరా ఫతేహి కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.
News March 18, 2026
డొమెస్టిక్ LPG ఉత్పత్తి 40% పెరిగింది: కేంద్రం

LPG కొరత నేపథ్యంలో వినియోగదారులు PNGలోకి మారాలని కేంద్రం మరోసారి సూచించింది. LPG సమస్య ఉన్నా ఎక్కడా గ్యాస్ లభ్యత పూర్తిగా ఆగిపోలేదని తెలిపింది. LPG ఉత్పత్తి 40% పెరిగిందని పేర్కొంది. క్రూడ్, పెట్రోల్, డీజిల్ లభ్యత సాధారణంగానే ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రాలు/యూటీలకు అదనంగా 10% కమర్షియల్ LPGని కేటాయిస్తున్నామని.. ఇది భవిష్యత్తులో ఆ ప్రాంతాల్లో LPG నుంచి PNGకి మారేందుకు సహాయపడుతుందని తెలిపింది.
News March 18, 2026
OFFICIAL: SRH కెప్టెన్గా ఇషాన్

IPL-2026 ప్రారంభంలోని కొన్ని మ్యాచులకు యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరిస్తారని SRH ప్రకటించింది. అలాగే అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్గా ఉంటారని పేర్కొంది. పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయం నుంచి కోలుకున్న తర్వాత జట్టులో చేరుతారని తెలిపింది. దీంతో ఈనెల 28న RCBతో జరిగే తొలి మ్యాచ్లో కిషన్ జట్టును నడిపించనున్నారు.


