News May 14, 2024
శ్రీకాకుళం: పెరిగిన పోలింగ్.. ఎవరికి మేలు..?

శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం పెరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 72.41 శాతం నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో తాజా సమాచారం మేరకు 75.41 శాతం నమోదైంది. మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా గతంతో పోలిస్తే సుమారు 3 శాతం మేర ఓటింగ్ పెరిగింది. ఈ పెరిగిన ఓటింగ్తో అధికార, ప్రతిపక్షాలు తమకే మేలు జరుగుతున్నాయని ఆశిస్తున్నాయి.
– మరి మీ కామెంట్ ఏంటి..?
Similar News
News October 30, 2025
ఇచ్ఛాపురంలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్

‘మెంథా’ తుపాను ప్రభావంతో జిల్లాలో నష్టం వాటిల్లిన నేపథ్యంలో, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం ఇచ్ఛాపురం మండలంలో పర్యటించారు. తుపాన్ కారణంగా జిల్లాలో అత్యధికంగా ఈ మండలంలో 1,118 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. బిల్లంగి, జగన్నాథపురం గ్రామాల్లో నీటి ముంపులో ఉన్న వరి చేలును ఆయన పరిశీలించారు. 53 క్యూసెక్కులు నీరు బహుదానదిలో ప్రవహిస్తుందన్నారు. నష్టం అంచనా వేయాలన్నారు.
News October 30, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

★పొందూరులో 50 గ్రామాలకు రాకపోకలు బంద్
★సోంపేట ప్రభుత్వ పాఠశాలలో కూలిన చెట్టు
★పంటపొలాలు, వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు కూన, బగ్గు, బెందాళం
★నందిగం: కోతకు గురైన R&B రోడ్డు.. తక్షణ చర్యలు
★పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన పాతపట్నం ఎమ్మెల్యే
★కాశీబుగ్గలో పలు మెడికల్ షాపుల్లో దొంగతనాలు
★పలాస: వరహాల గెడ్డలో వ్యక్తి గల్లంతు
★ నారాయణపురం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాగావళి
News October 29, 2025
శ్రీకాకుళం: పొలాల్లో వాన నీరు..రైతు కంట కన్నీరు

‘మొంథా’ తుపాన్ ప్రభావానికి భారీ వర్షాలు, ఈదురు గాలులకు శ్రీకాకుళం జిల్లాలోని 2,230.29 హెక్టారాల్లో పంట నష్టం సంభవించింది. ఈ విపత్తుతో 4,801 మంది రైతులు నష్టపోయారు. వరి 2,227.5 హెక్టార్లు, ఉద్యాన పంటలు 2.79 హెక్టార్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా ఇచ్ఛాపురం 1,118 హెక్టార్లలో వరికి నష్టం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారు. పొలాల్లో నీటిని మళ్లించి, సాగును కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు.


