News May 14, 2024
ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద రోడ్డుపై ట్రాక్టర్లో ధాన్యం లోడ్ చేస్తున్న కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు రాజోలు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Similar News
News March 22, 2026
ఏప్రిల్ నుంచి లైసెన్స్కు మూడు పరీక్షలు?

TG: రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు లైసెన్స్ జారీలో త్రీ టైర్ సిస్టమ్ తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం LLR, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు మరో టెస్ట్ను యాడ్ చేయనుంది. LLR పరీక్ష కన్నా ముందు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు గంటల నిడివిగల ఈ పరీక్షలో ఆరు పార్టులు ఉంటాయి.
News March 22, 2026
ఆదిత్య ధర్ క్రికెట్ వదిలేయడానికి కారణం ఇదే!

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ భారత్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నారు. తనకు 2002 అండర్-19 WCలో చోటు పక్కా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీని సెలక్ట్ చేశారు. గొప్ప ఫామ్లో ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వకుండా రాజకీయాలు చేశారని క్రికెట్కు గుడ్బై చెప్పి సినిమాల్లోకి వచ్చారు. కాగా బిన్నీ ఆ టోర్నమెంటులో 6 మ్యాచుల్లో 34 రన్స్ మాత్రమే చేశారు.
News March 22, 2026
ప్రత్యేక ఫ్లైట్ డిమాండ్ చేసినట్లు వార్తలు.. కోహ్లీ రియాక్షన్ ఇదే!

ఐపీఎల్ కోసం RCB బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే లండన్లో ఉంటున్న కోహ్లీ.. ఈ సీజన్లో రెగ్యులర్గా ఇంటికి వెళ్లి రావడానికి ప్రత్యేక ఫ్లైట్ అరేంజ్ చేయాలని RCB మేనేజ్మెంట్ను డిమాండ్ చేశారని పలు రిపోర్ట్స్ వచ్చాయి. దీనిని కోహ్లీ కొట్టిపారేశారు. ఈ వార్త హాస్యాస్పదంగా ఉందని సూచించేలా ఆ రిలేటెడ్ పోస్ట్ ఇన్స్టా స్టోరీలో షేర్ చేసి లాఫింగ్ ఎమోజీ పెట్టారు.


