News May 14, 2024
NZB: భార్యాభర్తల మధ్య గొడవ.. ముంజైలో కేసు

భర్తే తనను మోసం చేశాడని ఓ మహిళ ఆందోళనకు దిగింది. NZBలోని కోటగల్లికి చెందిన మనష్వినికి 2016లో శ్రీనివాస్తో వివాహమైంది. పెళ్లి తర్వాత అత్తగారుంటున్న ఇంటిని మనష్వినికి బహుమతిగా ఇచ్చారు. అయితే కొన్ని రోజులుగా ఆమె భర్త, అతడి మొదటి భార్య సవితతో కలిసి ఆ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ఆమెపై దాడి చేసి బెదిరించారు. దీంతో ఆమె సవిత నివాసం ఉంటున్న ముంబైకి వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News March 20, 2026
NZB జిల్లా ప్రజలకు కలెక్టర్ రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నియమ నిష్ఠలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. శనివారం నాటి ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ను కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
News March 20, 2026
NZB: గోదావరి పుష్కరాల కోసం రూ. 500 కోట్ల ప్రతిపాదన

రాష్ట్రంలో 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నేటి రాష్ట్ర బడ్జెట్లో రూ.500 కోట్లను ప్రతిపాదించారు. ఈ నిధులతో NZB జిల్లాలోని కందకుర్తితో పాటు TGలోని బాసర, ధర్మపురి, కాలేశ్వరం, భద్రాచలం ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పించి కుంభమేళా తరహా పుష్కరాలు జరుపనున్నారు. ఈ ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష జరిపారు.
News March 20, 2026
NZB: అంతరిస్తోన్న పిచ్చుకల కోసం ఫీడర్లు

ఒకప్పుడు మన ఇంటి ముంగిట సందడి చేసిన పిచ్చుకలు నేడు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. వాటి ప్రాముఖ్యతను గుర్తించి, వాటిని సంరక్షించాలన్న ఉద్దేశంతో నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నేచర్ ఫరెవర్ సొసైటీ వ్యవస్థాపకుడు Md దిలావర్ కృషితో 2010లో మొదటి సారిగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. NZBకు చెందిన మంచాల జ్ఞానేందర్ పిచ్చుకల కోసం నీరు, ఆహారం పెట్టేలా ఫీడర్లు పంపిణీ చేస్తున్నారు.


