News May 14, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

విజయవాడ మీదుగా వెళ్లే తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) కృష్ణా ఎక్స్ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని రైల్వే అధికారులు మార్పులు చేశారు. ట్రాక్ నిర్వహణ కారణాల రీత్యా నం.17405 TPTY-ADB ట్రైన్ను ఈ నెల 16, 22 తేదీల్లో, నం.17406 ADB-TPTY ట్రైన్ను ఈ నెల 15, 21 తేదీల్లో విజయవాడ మీదుగా నడపమని అధికారులు తెలిపారు. విజయవాడ, మధిర, ఖమ్మం మీదుగా కాక తెనాలి, సికింద్రాబాద్ మీదుగా ఆయా తేదీల్లో ఈ రైళ్లు నడుపుతామన్నారు.
Similar News
News October 30, 2025
అవనిగడ్డ నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం కోడూరు మండలంలో పర్యటించనున్నట్లు ఏపీ సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, 8:30 గంటలకు నాగాయలంకలో, 10:30 గంటలకు కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన ప్రకటనలో వివరించారు.
News October 29, 2025
కృష్ణా: 46,357 హెక్టార్లలో పంట నష్టం

తుపాన్ ధాటికి జిల్లాలో 46,357 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. 427 గ్రామాల పరిథిలో ఈ పంట నష్టం జరగ్గా 56,040 మంది రైతులు నష్టపోయారన్నారు. 45,040 హెక్టార్లలో వరి పంట, వేరుశెనగ 288 హెక్టార్లలో, 985 హెక్టార్లలో మిముము, 43 హెక్టార్లలో పత్తి పంట నష్టపోయిందన్నారు.
News October 29, 2025
సీఎం షెడ్యూల్ మార్పు.. అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ పర్యటన.?

సీఎం చంద్రబాబు షెడ్యూల్లో మార్పు జరిగింది. ఆయన నేడు కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించనున్నారు. కాగా, అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రోడ్డు మార్గంలో కోడూరు, నాగాయలంక మండలాలను సందర్శించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధితులను పరామర్శిస్తారని సమాచారం.


