News May 14, 2024

తూ.గో.: జనసేన ఇన్‌ఛార్జి అరెస్ట్.. పవన్ స్పందన

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ అరెస్ట్ అప్రజాస్వామికమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఓ లేఖ విడుదల చేశారు. YCP నాయకులే కవ్వింపు చర్యలకు పాల్పడిన సందర్భంలో చోటుచేసుకున్న వివాదంలో హత్యాయత్నం కేసు నమోదు చేయడం రాజకీయ కుట్రలో భాగంగా కనిపిస్తోందన్నారు. న్యాయపరంగా పోరాడతామని లేఖలో పేర్కొన్నారు. కాగా లీలాకృష్ణకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.

Similar News

News March 15, 2026

డాక్టర్ గోరంట్లకు నారా భువనేశ్వరి ఘన సత్కారం

image

NTR ట్రస్ట్, GSR మెడికల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో డా.గోరంట్ల రవిరాం కిరణ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. HYDలోని టీడీపీభవన్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. భువనేశ్వరి ఆహ్వానం మేరకు వెళ్లిన డాక్టర్ గోరంట్లను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పేదలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలని కోరారు.

News March 15, 2026

తూ.గో జిల్లాలో YCP కొత్త పరిశీలకుల నియామకం

image

తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు నూతన పరిశీలకులను YCP ఆదివారం నియమించింది. కొవ్వూరుకు గొందేశి శ్రీనివాసరెడ్డి, అనపర్తికి తులసి కుమార్, రాజానగరానికి చందన నాగేశ్వర్, నిడదవోలుకు గిరజాలబాబు, గోపాలపురానికి తోటరామకృష్ణ, రాజమండ్రి సిటీకి అద్దంకి ముక్తేశ్వరరావు నియమితులయ్యారు. ఈ నియామకాల ద్వారా పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐక్యత పెరుగుతుందని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి.

News March 15, 2026

టెన్త్ పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు: జిల్లా ఎస్పీ

image

టెన్త్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సూచించారు. 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి రాత పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నా రు. బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బంది, అభ్యర్థులు సెల్ ఫోన్స్ అనుమతించమన్నారు.