News May 14, 2024

తెలంగాణలో 3% పోలింగ్‌ పెరిగింది: వికాస్‌రాజ్‌

image

TG: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. సోమవారం ఉ.7-సా.6గంటల వరకు పోలింగ్ జరగ్గా.. మొత్తం 65.67% పోలింగ్‌ నమోదైందన్నారు. అత్యధికంగా భువనగిరిలో 76.78%, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48% పోలింగ్ నమోదైనట్లు వివరించారు. 2019 LS ఎన్నికలతో పోలిస్తే 3% పోలింగ్‌ పెరిగిందని, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.

Similar News

News March 6, 2026

తనూజ, దివ్వెల మాధురిపై పోలీసులకు ఫిర్యాదు

image

AP: తిరుమలలో <<19305826>>దివ్వెల మాధురి<<>>, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడంపై TTD స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరుపుకున్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల గెస్ట్ హౌస్‌లలో ఇలాంటి వేడుకలు నిషేధమని వెల్లడించింది. వీడియోలు తీసి SMలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఇక ఈ ఘటనపై TTD విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 6, 2026

పెట్రోల్ ధరలు పెరుగుతాయా?.. కేంద్ర వర్గాలు ఏం చెప్పాయంటే..

image

దేశంలో పెట్రోల్ ధరలు పెరగవని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ‘రష్యా నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తున్నాం. ముడి చమురు విషయంలో పరిస్థితి అదుపులోనే ఉంది. దేశీయ మార్కెట్లలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగవు’ అని వివరించాయి. హార్ముజ్ జలసంధి గుండా గ్యాస్, ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తగినంత మేర రిజర్వులు ఉన్నాయని వెల్లడించాయి.

News March 6, 2026

బాలెన్ షా.. జెంజీల నయా బాద్‌షా!

image

నేపాల్ వారసత్వ రాజకీయాలపై తిరగబడ్డ Gen-Z ఉద్యమాన్ని బాలెన్ షా ముందుండి నడిపించారు. 36ఏళ్ల ఈ యువనేత.. స్ట్రక్చరల్ ఇంజినీర్, ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, నటుడు, రైటర్, కవిగా నేపాలీలకు సుపరిచితుడు. 2022లో ఖాట్మండు మేయర్‌గా ఎన్నికై ప్రభుత్వాన్ని నిలదీయడంతో యూత్‌లో క్రేజ్ సంపాదించారు. దీంతో ఎన్నికల్లో ఆయనకు భారీగా ఓట్లు పడినట్లు తెలుస్తోంది. తన పార్టీ RSP <<19309327>>విజయం<<>> సాధిస్తే బాలెన్ నేపాల్ PM అవుతారు.