News May 14, 2024
ఆలూరు: ఓటు వేయడానికి వచ్చి వ్యక్తి మతి

ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాలలో ఓటు వేయడానికి వచ్చిన దుగునూరు చిట్టిబాబు(32) మృతి చెందారు. హైదరాబాద్ నుంచి బస్సులో వస్తుండగా 12వ తేదీ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతుడి భార్య పద్మావతి గత ఏడాది మరణించగా ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిరి మోక్షిత్, సుశాంత్ తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగిలారు. స్థానికుడు రాజు సమాచారంతో వైసీపీ MLA అభ్యర్థి కొడుకు చంద్రశేఖర్ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.
Similar News
News March 14, 2026
కర్నూలులో 397 మంది విద్యార్థులు గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 397 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 5,522 మందికి గాను 5,125 మంది మాత్రమే హాజరైనట్లు RIO లాలప్ప తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంచామని, జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాశారని ఆయన వెల్లడించారు.
News March 14, 2026
10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్: కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద కఠినంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
News March 14, 2026
కర్నూలు జిల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

జోహారాపురం సచివాలయంలో శుక్రవారం జరిగిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. ఈ పథకం కింద కర్నూలు జిల్లాలోని 2,72,757 మంది అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ.154.94 కోట్లు జమ చేసిందని కలెక్టర్ తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె వివరించారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.6వేలు జమవుతుందని తెలిపారు.


