News May 14, 2024
వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం వాజేడు ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైకుపై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడు మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 10, 2025
రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో

రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో ఐకేపీ సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో ప్లాంట్ నిర్మాణానికి 4 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్లాంట్ నిర్వహణ మహిళ సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్లాంట్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. 25 ఏళ్లపాటు వారంటీతో కూడిన సోలార్ పలకలు ఏర్పాటు చేయనున్నారు.
News November 10, 2025
పాత కక్షలతో హత్య.. ఇద్దరు నిందితులు అరెస్టు

ఎదులాపురం ముత్తగూడెంకు చెందిన బురా శ్రీనివాస్ను పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు రూరల్ సీఐ ఎం. రాజు తెలిపారు. బురా డేవిడ్, పేరెల్లి రాజశేఖర్ సుపారీ మాట్లాడుకుని శ్రీనివాస్ను కారులో కిడ్నాప్ చేసి, గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని ఎన్ఎస్పీ కెనాల్లో పడేశారని సీఐ వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
News November 8, 2025
ఖమ్మం: కడుపునొప్పి తాళలేక కార్మికుడి ఆత్మహత్య

తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుడు తగరం నాగరాజు (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు ఉరివేసుకున్నాడు. ఈ విషయం స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


