News May 14, 2024
వేమూరు మండలంలో రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి

మండలం పరిధిలోని బూతుమల్లి వద్ద రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్ళితే బూతుమల్లికి చెందిన గోగినేని వెంకటేశ్వరరావు(58) ప్రమాదవశాత్తు తెనాలి నుంచి రేపల్లె వెళ్లే రైలు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యా కుమారుడు ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 14, 2026
తెనాలిలో ఇనుప చట్రంతో పొట్టి శ్రీరాములు అద్భుత విగ్రహం

తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. ఈ నెల 16న పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 2 టన్నుల ఐరన్ స్ర్కాప్తో తయారు చేసిన విగ్రహాన్ని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఉంచారు. ఇంద్రకీలాద్రి పాలక మండలి సభ్యులు తోటకూర రమణారావు, బీసీ సంఘ అధ్యక్షుడు కేసన శంకరరావు విగ్రహాన్ని తిలకించి శిల్పులను అభినందించారు.
News March 14, 2026
పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: గుంటూరు ఎస్పీ

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే SSS పరీక్షల కోసం గుంటూరు జిల్లాలో 149 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా SP వకుల్ జిందాల్ తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు ఉండగా, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని చెప్పారు. మాల్ ప్రాక్టీస్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News March 14, 2026
అమరావతిలో స్థలం ఇస్తే స్టూడియో నిర్మిస్తాం: దిలీప్ రాజా

అమరావతిలో ప్రభుత్వం స్థలం కేటాయిస్తే స్టూడియో నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని మా-ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రభుత్వానికి మనవి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో సినిమా షూటింగ్లకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. సినిమా షూటింగ్లకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం బాధాకరమని పేర్కొన్నారు. ఇక్కడ చిత్రీకరణలు జరిగితే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని, దీనిపై స్పందించాలని కోరారు.


