News May 15, 2024
సింహాచలం: 22న స్వాతి నక్షత్ర హోమం

సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో నరసింహ జయంతి సందర్భంగా ఈ నెల 22న స్వాతి నక్షత్ర హోమాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. స్వాతి నక్షత్రం, నరసింహ జయంతి ఒకే రోజు రావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు పాల్గొన్నారు.
Similar News
News March 10, 2026
కేజీహెచ్ వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు

‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీహెచ్కు చెందిన ఇద్దరు వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. గైనిక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.ఉషాదేవి, అనస్థీషియా విభాగాధిపతి ప్రొఫెసర్ వాసుపల్లి రవికి 10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్పందించకపోతే అందుబాటులో ఉన్న ఆధారాలతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
News March 10, 2026
విశాఖలో యువకుడి అనుమానాస్పద మృతి

విశాఖలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు టూటౌన్ ఎస్ఐ మన్మథరావు మంగళవారం తెలిపారు. కొబ్బరి తోట ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు బర్రె శివ ఇంట్లోనే ఉరివేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుని మెడపై గాయాలు ఉండడంతో హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 10, 2026
విశాఖ, ఉప్పాడలో కోత నివారణ పనులు

విశాఖ, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్ర కోత నివారణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. విశాఖ తీర రక్షణ కోసం రూ.203 కోట్ల ప్రాజెక్టుకు తుది అనుమతులు లభించాయి. అలాగే ఉప్పాడ తీరంలో రక్షణ గోడ నిర్మాణానికి కేంద్రం రూ.323 కోట్లు మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ ప్రతిపాదించిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ద్వారా తీరం వెంబడి 5 కి.మీ.ల మేర మొక్కలు నాటి ప్రకృతి సిద్ధమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నారు.


