News May 15, 2024

మహబూబ్‌నగర్‌లో పెరిగిన పోలింగ్.. గెలువు ఎవరిదో..?

image

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 7.12 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 65.31 శాతం నమోదు కాగా ఈసారి 72.43 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి (BRS) 77,829 భారీ మెజార్టీతో కే అరుణ(BJP)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో చల్లా వంశీ చంద్ రెడ్డి (INC), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS),డీకే అరుణ(BJP)బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

Similar News

News March 9, 2026

MBNR: డిగ్రీ.. దరఖాస్తుల ఆహ్వానం

image

మహబూబ్‌నగర్‌లోని(దొడ్డలోనిపల్లి) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ Dr.జె.జయప్రద ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. నూతన ఏడాదికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, నేరుగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారితంగా సీట్లు కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 9, 2026

MBNR: ఈనెల 11 నుంచి అంబేడ్కర్ వర్సిటీ ప్రాక్టికల్స్

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సైన్స్, కంప్యూటర్స్ విద్యార్థులకు 1వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 80% హాజరు ఉన్న విద్యార్థులనే అనుమతిస్తారని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మరిన్ని వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.

News March 7, 2026

MBNR: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

image

స్వల్ప గొడవ విషయంలో తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం నవాబుపేట మండలం గురుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గణేష్ (21) అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. హోలీ వేడుకల్లో స్నేహితులతో గొడవపడటంతో ఇంటి పెద్దలు మందలించారు. దీనిని అవమానంగా భావించిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.