News May 15, 2024

చిలకలూరిపేట: బస్సులోనే మృతదేహాలు

image

చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద బస్సును టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బస్సులో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి అస్తిపంజరాల స్థితిలో ఉన్నట్లు సమాచారం. వైద్యులు వచ్చి పంచనామా నిర్వహించిన అనంతరం వాటిని ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఘటనాస్థలిని ఎస్పీ పరిశీలించారు. ఐజీ కూడా ప్రమాద స్థలానికి రానున్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 12, 2026

గుంటూరులో విషాదం

image

గుంటూరు కాకుమానువారితోటకు చెందిన 9వ తరగతి విద్యార్థి రాఘవ (14) మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని తండ్రి రాము ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవ తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళి అరండల్ పేట 8/4 లో మామిడి కాయలు కోస్తుండగా బావిలో పడ్డాడు. ఈ క్రమంలో ఊపిరాడక రాఘవ మృతిచెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News March 11, 2026

వైసీపీ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధం

image

వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పార్టీ అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారని నాయకులు చెబుతున్నారు.

News March 11, 2026

పెదకాకాని మర్డర్ కేసు ఛేదించిన GRP పోలీసులు

image

పెదకాకాని రైల్వే స్టేషన్‌లో మార్చి 4న జరిగిన హత్య కేసును గుంటూరు GRP పోలీసులు, RPF సిబ్బంది ఛేదించారు. మృతుడు పరమడం అనీశ్ బ్లేడ్‌గా గుర్తించారు. దొంగతనాల వాటా విషయంలో జరిగిన వివాదంతో అతని సహచరులే హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఎఫ్. కుమార్ ఎంతోని కుమార్, దీపేశ్ MS మెంటల్, కొప్పుల వెంకటేశ్ వెంగీలను మార్చి 9న గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.