News May 15, 2024

శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల ఆదాయం కన్నా ఖర్చు అధికం

image

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగిన శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల లెక్కలను అధికారులు ఎట్టకేలకు తేల్చారు. ఆదాయం కంటే ఖర్చే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు రూ. 2,37,30,121 ఖర్చు చేయగా, అన్ని మార్గాల ద్వారా రూ.1,89,61,124 ఆదాయం సమకూరింది. సెక్టార్ల ద్వారా సుమారు రూ.93 లక్షలు, పరోక్ష సేవల ద్వారా రూ.7 లక్షలు, పోస్టల్ ద్వారా అంతరాలయ సేవలకు రూ.90 వేలు వచ్చాయి.

Similar News

News July 7, 2025

దరఖాస్తు సమర్పించిన రోజే.. సమస్య పరిష్కారం.!

image

ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన తుపాకుల శైలజకు 2022లో YSR కాలనీలో డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాగా, అప్పుడు అనారోగ్య కారణాల వల్ల ఇల్లు తీసుకోలేదు. దీంతో సోమవారం శైలజ ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు దరఖాస్తు అందించింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించడంతో ఆమెకు డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు శైలజ కృతజ్ఞతలు తెలిపింది.

News July 7, 2025

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్.. అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలలో నమ్మకం కలిగించాలని చెప్పారు. జిల్లా అధికారులు ప్రతి వారం మండల అధికారులతో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు.

News July 7, 2025

ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

image

పేద, మధ్య తరగతి వర్గాల కలల ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం భారీగా పెరిగింది. ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న తరుణంలో సామగ్రి రేట్లు అధికం కావడంతో భారంగా మారింది. వీటికి తోడు సిమెంట్, స్టీల్, ఇసుక ధరలతో పాటు, కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పాటు, మరో రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు అదనపు భారం పడుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.