News May 15, 2024

ప్రకాశం : బైక్ లు ఢీకొని ఒకరు దుర్మరణం

image

మర్రిపూడి మండలం శివరాయునిపేటకు చెందిన మానివేల చిన్నవీరయ్య, చీమల వెంకటేశ్వర్లు బైక్ పై ఉప్పలపాడు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఇదే సమయంలో మర్రిపూడి మండలం చిమటకు చెందిన జానపల్లి వెంకటేశ్వర్లు బైకుపై మర్రిచెట్లపాలెం వెళ్తున్నారు. ఉప్పలపాడు సమీపంలో బైక్ లు ఢీకొనడంతో చిన్నవీరయ్యకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై కోటయ్య కేసు నమోదు చేశారు.

Similar News

News November 2, 2025

ప్రకాశం ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు..!

image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితో పాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాలలో మన అప్రమత్తతే మనకు రక్ష అని సూచించారు.

News November 1, 2025

నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం: కలెక్టర్

image

తుఫాన్ వలన నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటామని కలెక్టర్ రాజబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడారు. రికార్డు స్థాయిలో తుఫాన్ వల్ల 20 సెంటీమీటర్ల వర్షం నమోదయిందన్నారు. ఫలితంగా వాగులు, వంకల ప్రవాహం పెరగడంతో పంట పొలాలు, రోడ్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు వివరించారు.

News November 1, 2025

ప్రకాశం ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు..!

image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం
పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారన్నారు. ఈ కర్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితో పాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాలలో మన అప్రమత్తతే మనకు రక్ష అన్నారు.