News May 15, 2024
క్రికెట్ అభిమానులకు గుడ్&బ్యాడ్న్యూస్

T20WC 2వ సెమీఫైనల్ వెస్టిండీస్లోని గయానాలో జరగనుంది. ఒకవేళ ఇండియా సెమీస్ చేరితే జూన్ 27న గయానాలో ఆడనుంది. అక్కడ 10.30amకి మ్యాచ్ ప్రారంభమైతే మన దగ్గర 8pm అన్నమాట. ఇండియాలోని ప్రేక్షకులు మ్యాచ్ వీక్షించేందుకు సమయం అనువుగా ఉండేందుకే రెండో సెమీఫైనల్లో భారత్కు అవకాశం ఇచ్చినట్లు espncricinfo తెలిపింది. అయితే.. రెండో సెమీఫైనల్కు <<13248114>>రిజర్వ్ డే<<>> లేకపోవడం ఆందోళన కలిగించే అంశం.
Similar News
News March 13, 2026
అన్నదాతా సుఖీభవ-అర్హత ఇలా తెలుసుకోవచ్చు

ఆన్లైన్లో annadathasukhibhava.ap.gov.in/ ద్వారా రైతులు తమ అర్హతను తెలుసుకోవచ్చు. పైన పేర్కొన్న పోర్టల్కి వెళ్లి Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత searchపై క్లిక్ చేస్తే.. మీ పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలతో పాటు పథకానికి అర్హులైతే స్టేటస్ దగ్గర Eligile అని వస్తుంది. ఒకవేళ కాకుంటే Remarks దగ్గర అందుకు గల కారణాలు వస్తాయి.
News March 13, 2026
రెస్టారెంటు బిల్లులో ‘LPG సర్ఛార్జ్’

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లు బిల్లులో ‘LPG సర్ఛార్జ్’ కలిపి వేస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10-30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అటు హైదరాబాద్లోని పలు హోటళ్లలో టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.30-40 ఉండే మసాలా దోశ ధరను రూ.60కి పెంచేశారు.
News March 13, 2026
ఈనెల 18 నుంచి పెళ్లిళ్లు.. గ్యాస్ కొరతపై ఆందోళన

ఈనెల 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. యుద్ధం వల్ల ఏర్పడిన గ్యాస్ కొరత ప్రభావం పెళ్లి భోజనాలపై పడనుంది. ఫంక్షన్లకు పెద్ద ఎత్తున వంటలు చేసే క్యాటరింగ్ నిర్వాహకులు గ్యాస్ స్టవ్లను ఉపయోగిస్తుంటారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వంటలు ఎలా చేయాలనే ఆందోళన మొదలైంది. ఇక కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టెలకూ డిమాండ్ పెరుగుతుండడంతో వివాహాలు చేసే కుటుంబాలపై మరింత భారం పడనుంది.


