News May 15, 2024
కోస్గి: విమానం ఎక్కేలోగా మృత్యువడిలోకి..

కాసేపట్లో విమానం ఎక్కాల్సిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందారు. కోస్గికి చెందిన పలువురు వ్యాపారులు కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లగా కాసేపట్లో విమానం ఎక్కాల్సి ఉంది. వారిలో ఒక్కరైన కూర వెంకటయ్య(75) అప్పటివరకు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. వెంకటయ్య తోటి బృందం దిగ్భ్రాంతికి గురైంది. దీంతో కోస్గిలో విషాదం నెలకొంది.
Similar News
News March 23, 2026
పాలమూరు: రైతులు ALERT.. 2 రోజులే ఛాన్స్.!

‘రైతుభరోసా’ పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25 వరకు దరఖాస్తులు చేసుకోవాలని పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటి వరకు రైతుభరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేసుకోవాలని, అప్లికేషన్ ఫామ్తో పాటు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాలన్నారు. SHARE IT.
News March 23, 2026
పాలమూరు: రైతులు ALERT.. 2 రోజులే ఛాన్స్.!

‘రైతుభరోసా’ పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25 వరకు దరఖాస్తులు చేసుకోవాలని పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటి వరకు రైతుభరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేసుకోవాలని, అప్లికేషన్ ఫామ్తో పాటు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాలన్నారు. SHARE IT.
News March 22, 2026
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: డీకే అరుణ

మహబూబ్నగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో వివిధ చేతివృత్తుల కుల సంఘాలతో ఎంపీ డీకే అరుణ శనివారం సమావేశమయ్యారు. విశ్వకర్మ, గొల్ల కురుమ, ఇతర బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. స్వర్ణకారులకు రుణ సదుపాయాల కల్పనతో పాటు, వారి విజ్ఞప్తులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.


