News May 15, 2024

వీసీల నియామకానికి ఈసీ అనుమతి

image

తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి ఇచ్చినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. దీంతో షెడ్యూల్ ప్రకారమే వీసీల నియామకం జరగుతుందన్నారు. ఇప్పటికే అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. JNTUH, ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మ గాంధీ, ఆర్కిటెక్చర్(JNAFAU), తెలుగు, అంబేడ్కర్ వర్సిటీలకు కొత్త VCలను నియమించనున్నారు.

Similar News

News February 7, 2026

చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్.. త్వరలోనే నిర్ణయం!

image

చిన్న పిల్లలను SM నుంచి దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. వయసు ఆధారంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల వినియోగానికి అనుమతులపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్‌ కృష్ణన్‌ తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల ఆర్థిక సర్వే చేసిన సూచనలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ICANN సదస్సులో ఆయన మాట్లాడారు.

News February 7, 2026

ఇండియా-US డీల్.. చైనాకు లాభం!

image

ఇండియా, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో పరోక్షంగా చైనా లాభపడుతోంది. US ఆంక్షల నేపథ్యంలో రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లను భారత్ తగ్గించింది. దీంతో చైనా వైపు రష్యా మొగ్గుచూపింది. ఒక్కో బ్యారెల్‌పై 12 డాలర్ల డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. ఇప్పటికే రష్యా చమురులో చైనా 47% వరకు కొంటుండటం గమనార్హం. మరోవైపు 2024 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్‌లో ఇండియాకు రష్యన్ ఆయిల్ దిగుమతులు 27.5% తగ్గిపోయాయి.

News February 7, 2026

IND-US ట్రేడ్ అగ్రిమెంట్‌తో గ్రామీణ జీవనోపాధి: కేంద్ర మంత్రి

image

IND-US ఇంటరిమ్ వాణిజ్య ఒప్పందంతో వికసిత్ భారత్ వైపు కీలక అడుగుపడిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ‘గ్రామీణ ప్రజల జీవనోపాధికి భరోసా లభించింది. మొక్కజొన్న, సోయా, పాలు, పౌల్ట్రీ, ఇథనాల్, టొబాకో, పలురకాల కూరగాయలు, మాంసం రంగాలు సురక్షితంగా ఉన్నాయి. ప్రజా సంక్షేమం, వ్యాపారాభివృద్ధితోపాటు ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని ఈ అగ్రిమెంట్ బలోపేతం చేస్తుంది’ అని SMలో పేర్కొన్నారు.