News May 16, 2024
పత్తికొండలో అత్యధికం.. కర్నూలు రూరల్లో అత్యల్పం

కర్నూలు జిల్లాలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పత్తికొండలో మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా 42.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అలూరు 5.2, కౌతాళం 4.6, అస్సరి3.8, కర్నూలు అర్బన్ 3.6, కల్లూరు 3.2 ఆధోని, కర్నూలు రూరల్లో 1.2, మొత్తం 8 మండలాల్లో 65.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
Similar News
News January 13, 2026
ఇంటిల్లిపాది సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి: డీఐజీ

తెలుగు సంస్కృతి సంప్రదాయ మేళవింపు సంక్రాంతి పండుగను ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని డీఐజీ, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భోగి, మకర, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
News January 13, 2026
కర్నూలు: 95 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాల అందజేత

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టు వద్ద నిర్వహించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన 95 మంది లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు, మెగా కీలు అందజేశారు. టిడ్కో గృహాలకు విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఫిబ్రవరిలో మరో 500 గృహాలు అందజేస్తామన్నారు.
News January 13, 2026
ప్రాక్టికల్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను అన్ని సౌకర్యాలతో కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్ష గదులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. సెల్ఫోన్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. జనవరి 27 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు 21,150 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.


