News May 16, 2024
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసనలు

TG: నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తానని సీఎం చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో 90% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. అలాగే రైతుభరోసా ఇవ్వట్లేదని, వడ్లు కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తిన కేసీఆర్.. BRS కార్యకర్తలు రైతుల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు.
Similar News
News February 3, 2026
మా సహనమే గెలిపించింది: మోదీ

తమ సహనానికి ఫలితమే అమెరికాతో వాణిజ్య ఒప్పందమని PM మోదీ అన్నారు. ‘టారిఫ్స్ను కొందరు విమర్శించారు. కానీ మేం ఓపికగా ఉన్నాం. ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి’ అని NDA పార్లమెంటరీ పార్టీ భేటీలో అన్నారు. ప్రపంచ క్రమం మారుతోందని, ఇండియా వైపు అడుగులు పడుతున్నాయని చెప్పారు. వాణిజ్య ఉద్రిక్తతల మధ్య కూడా ఇండియా ప్రయోజనం పొందుతోందని తెలిపారు. అంతకుముందు ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్వీట్ చేశారు.
News February 3, 2026
అలాగైతే ఇండియా నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్పై సుప్రీం ఆగ్రహం

వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మా దేశ ప్రైవసీపై మీరు ఆటలు ఆడలేరు. ఇక్కడి డేటాలో ఒక్క అక్షరం/అంకె కూడా షేర్ చేయడానికి మేం అనుమతివ్వం’ అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు.
News February 3, 2026
పశువుల పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో పూర్తి వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.


