News May 16, 2024
MBNR: మొత్తం 5,575 పదో తరగతి ఫెయిల్

ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం 44,898 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 39,323 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,575 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 2,127 మంది అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 526 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరందరూ జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు.
Similar News
News January 14, 2026
పాలమూరు: బొటానికల్ గార్డెన్లో అరుదైన పుట్టగొడుగు

జడ్చర్ల డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ మరో అరుదైన జీవజాతికి నిలయమైంది. ఇక్కడ ‘కాప్రినొప్సిస్ నివియా’ అనే అరుదైన పుట్టగొడుగును ప్రొఫెసర్ సదాశివయ్య బృందం గుర్తించింది. దీని ఫలనాంగాలు మంచు రంగులో ఉండి, మంచుతో కప్పబడినట్లు కనిపిస్తాయి. అందుకే దీనిని ‘స్నోయి ఇంకాంప్’ అని పిలుస్తారు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే తన జీవిత చక్రాన్ని ముగిస్తుందని ప్రొఫెసర్ వివరించారు.
News January 14, 2026
పాలమూరు: ఈనాటి ముఖ్య వార్తలు!!

✒T-20 లీగ్.. అదిలాబాద్ పై మహబూబ్ నగర్ ఘనవిజయం
✒అభివృద్ధి కేంద్ర నిధులతోనే: ఎంపీ డీకే అరుణ
✒ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు
✒పలు గ్రామాల్లో క్రీడా పోటీలు
✒పాలమూరు: రోడ్డు ప్రమాదం.. తల్లీకుమార్తె మృతి
✒GDWL:భార్య కాపురానికి రావడంలేదని గొంతు కోసుకున్న భర్త
✒నాగర్కర్నూలు: ఐదుగురు ఏఈఓల సస్పెన్షన్
✒ఈనెల 19 నుంచి జోగులాంబ బ్రహ్మోత్సవాలు
News January 13, 2026
MBNR: సిరి వెంకటాపూర్లో 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత

మహబూబ్నగర్ జిల్లాలో గత 24 గంటల్లో చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్లో అత్యల్పంగా 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేవరకద్రలో 15.5, కొల్లూరులో 17.9, కౌకుంట్ల 18.0, సల్కర్పేటలో 18.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన కొద్దిరోజులతో పోలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో జిల్లా ప్రజలకు చలి నుంచి కాస్త ఉపశమనం లభించింది.


