News May 16, 2024

విజయనగరం: ఎంపీసీలో 170.. బైపీసీలో 153

image

ఉమ్మడి జిల్లాలోని అంబేడ్క‌ర్ గురుకుల కళాశాలల్లో ఫస్టియర్‌లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త టి.పద్మజ తెలిపారు. బాలురుకు 210(ఎంపీసీ-110, బైసీపీ-100) బాలికలకు 169(ఎంపీసీ-60, బైసీపీ-53, సీఈసీ-22, ఎంఈసీ-33) సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 16న కొప్పెర్ల గురుకులంలో బాలురకు, 17న చీపురుపల్లిలో బాలికలకు కౌన్సెలింగ్ ఉంటుందని, ఆసక్తిగల వారు సర్టిఫికేట్లతో హాజరవ్వాలన్నారు.

Similar News

News April 22, 2025

VZM: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

రేపు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో 2,359 పాఠశాలల నుంచి 23,765 మంది పరీక్ష రాయగా వారిలో 12,504 మంది బాలురు, 11,711 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది కాగా ప్రైవేట్‌గా 835 మంది పరీక్ష రాశారు. మొత్తం 119 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

News April 22, 2025

విజయనగరం: Pic Of The Day

image

పోషకాహారంపై చిన్నారి వేషధారణ ఆలోచింజేస్తోంది. తెర్లాం మండలం కాగాం గ్రామానికి చెందిన జొన్నాడ సరస్వతి పోషణ పక్వాడాలో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంగన్వాడీ కార్యకర్తలు సరస్వతితో కాయగూరలు, ఆకుకూరలతో వేషధారణ వేయించారు. చెవి దిద్దులుగా టమాటాలు, మెడలో క్యారెట్, గోరు చిక్కుడు హారం, నడుముకు కరివేపాకు కట్టారు. గర్భిణులు ఏ ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందో ఈ చిన్నారి ప్రదర్శనతో వివరించింది. 

News April 22, 2025

పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు: VZM SP

image

బొబ్బిలి PSలో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మోహన్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. పార్వతీపురం ఏకలవ్య స్కూల్లో చదువుతున్న బాలికకు తన మామయ్య ఫోన్ ఫే ద్వారా నగదు మోహన్‌కు పంపారని, డబ్బులు తీసుకొనేందుకు బాలిక బొబ్బిలికి రాగా రూమ్‌కి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. నేరం రుజువు కాగా శిక్ష ఖరారైందన్నారు.

error: Content is protected !!