News May 16, 2024
POKలో ‘పవర్’ చిచ్చు.. చీలిక తప్పదా?(1/3)

భారత్లోకి ఉగ్రవాదులను పంపుతూ శునకానందం పొందుతున్న పాక్ ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. ఓవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు POKలో ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇది దేశం చీలిక దిశగా సాగినా ఆశ్చర్యం లేదని విశ్లేషకుల అంచనా. POKలో ఉన్న 2,600MW నీలమ్ జీలమ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో తమకు వాటా ఇవ్వాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. GOVT ఉద్యోగులపైనా చిన్న చూపు ఉందని, జీతాలు తక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు.
Similar News
News February 11, 2026
ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయట

ఒడిశాలోని బింకా సమీపంలో మహానది తీరాన ఉన్న పాపాక్షయ ఘాట్కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రాహ్మణ హత్య దోషంతో బాధపడిన అనంగ భీమదేవుడు ఇక్కడ స్నానం చేసి విముక్తి పొందాడని కథనం. ఓ ఆవు స్వయంగా పాలిచ్చిన చోట రాజు కపిలేశ్వర శివాలయాన్ని నిర్మించాడు. ఇక్కడి మహానదిలో స్నానం చేసి, శివుడిని దర్శించుకుంటే పాపాలు తొలగి మనశ్శాంతి కలుగుతుందని విశ్వాసం. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఈ ఘాట్కు ఏటా ఎంతో మంది వస్తుంటారు.
News February 11, 2026
సోషల్ మీడియాలో ఫేక్ AI కంటెంట్.. కేంద్రం కీలక ఆదేశాలు

సోషల్ మీడియాలో AI కంటెంట్కు SM ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ తొలగింపు విషయంలో కోర్టు/ప్రభుత్వం ఆదేశించిన 3 గంటల్లోగా తొలగించాలని గడువు విధించింది. అంతకుముందు 36 గంటలు గడువు ఉండగా ఈ నెల 20 నుంచి ఈ ఉత్తర్వులు అమలుకానున్నాయి. AI కంటెంట్ దుర్వినియోగంపై యూజర్లకు 3 నెలలకోసారి అవగాహన కల్పించాలని తెలిపింది.
News February 11, 2026
గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.


