News May 16, 2024
మెడిసిన్స్ ధరలు తగ్గించిన కేంద్రం

42 రకాల ఔషధాల ధరలను కేంద్రం తగ్గించింది. ఇందులో గుండె, కాలేయం, షుగర్ జబ్బులకు చెందిన మందులు కూడా ఉన్నాయి. యాంటిసిడ్స్, మల్టీ విటమిన్, యాంటీ బయాటిక్స్ ధరలను తగ్గించింది. తగ్గిన ధరలను డీలర్లు, స్టాకిస్టులకు వెంటనే అందించాలని ఫార్మా కంపెనీలను ఆదేశించింది. ధరల తగ్గింపుతో 10 కోట్లకుపైగా షుగర్ వ్యాధిగ్రస్థులు లబ్ధి పొందనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మంది షుగర్ వ్యాధిగ్రస్థులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి.
Similar News
News February 14, 2026
కార్పొరేషన్లలో ‘కారు’ డౌన్

TG: మున్సిపాలిటీల్లో సుమారు 13 చోట్ల గెలిచిన BRS.. కార్పొరేషన్లలో మాత్రం డీలా పడిపోయింది. 7 చోట్ల ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. మొత్తం 414 డివిజన్లలో 63 చోట్ల మాత్రమే విజయం సాధించింది. NZBలో 60 డివిజన్లు ఉండగా కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెంలో మూడో స్థానానికి పరిమితమైంది. పంచాయతీ ఎన్నికల్లో కాస్త ఫర్వాలేదనిపించినా నగర ప్రజలు పక్కనబెట్టినట్లు అర్థమవుతోంది.
News February 14, 2026
కూలి కూటికిరాదు, లేకి చేతికిరాదు

వ్యవసాయం, వ్యాపారం ఏదైనా అన్ని పనులకూ కూలీల మీదే ఆధారపడితే చేతికి వచ్చే లాభం కూలీలకే సరిపోతుంది. యజమానికి కనీసం తిండికి కూడా మిగలదు. అందుకే సాధ్యమైనంత వరకు మన పనులను మనమే చేసుకోవాలి. అలాగే ఇతరులకు పని అప్పగించేటప్పుడు నిర్లక్ష్యం, బాధ్యత లేనివారికి అప్పగిస్తే, ఆ పని పూర్తికాదు సరికదా, ఆశించిన ఫలితం మన చేతికి అందదు. అందుకే పని అప్పగించినా మన పర్యవేక్షణ తప్పక ఉండాలని ఈ సామెత తెలియజేస్తుంది.
News February 14, 2026
‘వీరు ఉపవాసం ఉండకపోవడం ఉత్తమం’

భక్తితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి గర్భిణీలు ఆరోగ్యం దృష్ట్యా ఉపవాసానికి దూరంగా ఉండటం మేలు. మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు కఠిన ఉపవాసం చేయకూడదంటున్నారు డాక్టర్లు. ‘శారీరక ఇబ్బందులున్న మహిళలు ఉపవాసం మానేయవచ్చు. ఆహారం తీసుకుంటూ శివ నామస్మరణ, ధ్యానం చేస్తే అంతటి సమానమైన పుణ్యం లభిస్తుంది’ అని పండితులు సూచిస్తున్నారు.


