News May 17, 2024
కడప: భగ్గుమంటున్న కూరగాయల ధరలు

జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పచ్చిమిరపకాయల ధర ఒక్కసారిగా 70 రూపాయలకు చేరింది. అల్లం ధర రూ.170 పలుకుతోంది. బీన్స్ కిలో రూ.75 పలుకుతోంది. క్యాప్సికం, కాకర కిలో రూ.60, బీరకాయ, అలసంద కాయలు కిలో రూ.55 పలుకుతున్నాయి. టమోటా, వంకాయలు మాత్రమే కిలో రూ.20 ఉండగా మిగిలిన కూరగాయల ధరలన్నీ భారీగా పెరిగాయి.
Similar News
News November 2, 2025
వరల్డ్ కప్.. వికెట్ పడగొట్టిన శ్రీచరణి

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన టీం ఇండియా బౌలర్ శ్రీచరణి వికెట్ పడగొట్టింది. సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్గా పెవిలియన్కు పంపింది.
News November 2, 2025
మాజీ ఉప రాష్ట్రపతిని కలిసిన మాజీ సైనికులు

కడప R&B గెస్ట్ హౌస్లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును ఆదివారం జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ మాజీ సైనికులు మర్యాదపూర్వకంగా కలిశారు. అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా సంతోషంగా ఉండాలని వెంకయ్య చెప్పారన్నారు. తమ పట్ల మాజీ ఉప రాష్ట్రపతి చూపిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపామని వారు అన్నారు.
News November 2, 2025
విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్ కు కాల్ చేయండి.!

ప్రతి సోమవారం విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని మొట్టమొదటగా నిర్వహించనున్నట్లు సంస్థ ఛైర్మన్ శివశంకర్ లోతేటి తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లా వాసులు ఉదయం 10-12 గంటల మధ్య 89777 16661 నంబర్కు కాల్ చేసి తమ సమస్యలను వివరించవచ్చన్నారు.


