News May 17, 2024
REWIND-2019: మల్కాజిగిరిలో BRS ఓటమి!

మల్కాజిగిరిలో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్గా మారింది. 2019లోనూ రసవత్తర పోరు సాగింది. రాజశేఖర్ రెడ్డి(BRS)పై రేవంత్ రెడ్డి (INC) 10,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాంచందర్ రావు(BJP) 3వ స్థానంలో నిలిచారు. కానీ, ప్రస్తుత రాజకీయాలు మారాయి. ఎన్నికలకు ముందు ఈటల (BJP), సునీత (INC), రాగిడి (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు తమదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
Similar News
News September 14, 2025
HYD: కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్

ప్లాట్ల అమ్మకం ముసుగులో చీటింగ్ చేసి పరారీలో ఉన్న కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీని LBనగర్ SOT బృందం, LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రదేశాల్లో ప్లాట్లను అమ్మే ముసుగులో భారీగా డబ్బు కాజేసి చాలా మందిని మోసం చేసిన ఆదిభట్లకు చెందిన శ్రీకాంత్(35)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై సరూర్నగర్, వనస్థలిపురం, మేడిపల్లిలో కేసులు ఉన్నాయని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.
News September 14, 2025
GHMC వెథర్ రిపోర్ట్ @ 10AM

జీహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు ఆకాశం సాధారణంగా మేఘావృతంగా ఉండి.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 30- 40KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠం 23°C ఉండే అవకాశం ఉందని తెలిపింది. కాగా నిన్న నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్ఠం 29.0°C, కనిష్ఠం 22.2°Cగా నమోదైంది.
News September 14, 2025
GDPలో MSMEలు 10% వాటా సాధించాలి: మంత్రి

రాష్ట్ర GDPలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) వాటా 10% ఉండేలా తమ ప్రభుత్వం నూతన పాలసీని రూపొందించినట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం గో-నేషనల్- ఎక్స్ పో(GoNat) 2025 5వ ద్వైవార్షిక సదస్సును ప్రారంభించారు. నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం, నిధుల సమీకరణకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నట్టు తెలిపారు.