News May 17, 2024

తిరుపతి: ముప్పుతిప్పలు పెడుతున్న ఏనుగు

image

తిరుపతి జిల్లా పాకాలలో ఏనుగు అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. వారం క్రితం అరగొండ సమీపంలో ఒకరిని ,వెంగంపల్లి వద్ద మరొకరిని ఈ ఏనుగు పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.. దీంతో ఏనుగు కోసం అటవీ అధికారులు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఏనుగు ఎప్పుడు ఏ ప్రాంతంలోకి చొరబడుతుందో అని ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.

Similar News

News November 3, 2025

చిత్తూరు: వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి పాల్గొన్నారు.

News November 3, 2025

మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన

image

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్‌కు అప్పగించారు.

News November 3, 2025

చిత్తూరు: ఆధార్ అప్‌ డేట్ గడువు పెంపు

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌కు ప్రభుత్వం ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌ను 6వ తేదీ లోపు పూర్తి చేసేలా హెచ్ఎంలు, ఎంఈవో, డీవైఈవోలు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలతో సమన్వయం చేసుకుని పెండింగ్ ఉన్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేయించాలని ఆమె ఆదేశించారు.