News May 17, 2024
మెదక్: కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు.. ఈనె 30 LAST DATE
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి పది ఫలితాల్లో 7.0 జీపీఏ ఆపైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోడానికి అర్హులన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 5, 2024
మెదక్: నేటితో ముగియనున్న డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఉమ్మడి మెదక్ జిల్లా పరంగా గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న డీఎస్సీ 2024 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నేటితో ముగియనుందని జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంకెవరైనా మిగిలిన అభ్యర్థులు ఉంటే ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరారు.
News October 5, 2024
మెదక్: పక్కాగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన: అదనపు కలెక్టర్
డిఎస్సీ 2024లో అర్హత సాధించిన 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పక్కాగా, వేగవంతంగా చేపట్టాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. డీఎస్సీ 2024లో 704 ఎంపికయ్యారని 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో జరుగుతుండగా గురువారం సందర్శించారు. మొత్తం 704 మంది అభ్యర్థులకుగాను 618 మంది అభ్యర్థులు వచ్చారు.
News October 5, 2024
మెదక్: ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన
ఉమ్మడి జిల్లాలోని మెదక్,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.మెదక్,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని,కొన్నిచోట్ల మోస్తారు వర్షం మరి కొన్నిచోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.